Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడపై కత్తిపోటు గుర్తించిన పోలీసులు
ఛండీగఢ్ : హర్యానాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హర్యానాలోని సోనిపట్ రారు స్కూల్లో చదువుకుంటున్న బాలిక అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11వ తరగతి చదువు కుంటున్న బాలిక మతిందు గ్రామానికి చెందినదినట్టు గుర్తించారు. ఆమె మెడపై కత్తిపోటు ఉన్నట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోనిపట్ ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. స్కూల్ యాజమాన్యం ఈ విషయాన్ని బయటకి వెల్లడించలేదు.