Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల్లో ఇద్దరు పౌరులు, ఒక జవాను
శ్రీనగర్ : పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంది. పాక్ కాల్పుల్లో ఇద్దరు పౌరులు, ఒక జవాన్ మృతిచెందారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ కె.కె.శర్మ తెలిపిన వివరాల ప్రకారం..భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దురేఖ వెంబడి సాంబా, జమ్మూ జిల్లాల పరిధిలో పాక్ రెండో రోజు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సాంబా సెక్టార్లో గురువారం (మొదటి రోజు) జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు, ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ జవాన్ ,హెడ్కానిస్టేబుల్ ఎ.సురేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం రాత్రి మరణించాడు. కాల్పులు కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు.