Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్ అధికారులు
కోల్కతా: ఆధార్ నమోదుతో అదనంగా ఉన్న పీఎఫ్ అకౌంట్లను తొలగించేందుకు మార్గం సుగమమవుతుం దని ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) అధికారులు శుక్రవారం వెల్లడించారు. పాత ఖాతాదారుల ఆధార్నమోదు ప్రక్రియ కొనసాగుతున్నదనీ పూర్తవగానే ఈ ఏరివేతలకు పూనుకుంటామని తెలిపారు. దీంతో ఆన్లైన్లోనే సెటిల్మెంట్ చేసుకోవచ్చని అన్నారు. శుక్రవారం ఓ సెమినార్లో రీజినల్ పీఎఫ్ కమిషనర్ నవేందు రారు మాట్లాడుతూ.. బెంగాల్ రాష్ట్రంలో 70లక్షల పీఎఫ్ అకౌంట్లున్నాయి కానీ ప్రతినెలా పీఎఫ్ను జమచేసేవారు 20లక్షల మంది సభ్యులు మాత్రమేనని అన్నారు.
ఆధార్నమోదైన యూఏఎన్(యూనివర్సల్ అకౌంట్ నెంబర్)సభ్యుల పీఎఫ్ అకౌంట్లు కొత్త యజమానికి వాటంతట అవే బదిలీ అవుతాయని అన్నారు. ఆధార్నమోదు కార్యక్రమం పూర్తయితే అదనంగా ఉన్న పీఎఫ్ అకౌంట్లను తొలగించి సభ్యుడికి ఒకే అకౌంట్ను అందించేందుకు వీలవుతుందని అదనపు సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ ఎస్బి సిన్హా తెలిపారు. బ్యాంక్ అకౌంట్ను అను సంధానం చేసుకుంటే పీఎఫ్ అకౌంట్ను నిర్వహించు కోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం సులువవుతుందని చెప్పారు.