Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక మాధ్యమంలో అమ్మాయిల అశ్లీల ఫొటోలు.. వీడియోలు
- బాధిత యువతికి అండగా నిలబడలేకపోతున్న కాలేజీ యాజమాన్యం, తల్లిదండ్రులు
- న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయిస్తున్నవారు కొంతమందే..
స్వాతి (పేరు మార్చాం) 19 ఏండ్ల అమ్మాయి. కాలేజీలో ఒక అబ్బాయితో ఏర్పడిన పరిచయం కాస్తా, ప్రేమగా మారింది. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. అయితే ఆ బారుఫ్రెండ్, స్వాతి భావించనట్టు మంచివాడు కాదు. స్వాతి ఫొటోలను మార్ఫింగ్ చేసి...అశ్లీలంగా మార్చి...వాటిని ఇంటర్నెట్లో పెట్టడం, సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయటం చేశాడు. ఈ విషయం తోటి స్నేహితుల ద్వారా తెలుసుకున్న స్వాతి షాక్కు గురైంది. బారుఫ్రెండ్ చేసిన పనివల్ల, వేరే స్కూల్స్, కాలేజీల నుంచి అబ్బాయిలు పంపుతున్న అశ్లీల సందేశాలు చూసి భోరున విలపించింది. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు కాలేజీలో ఫిర్యాదు చేయలేక... 'తీవ్రమైన డ్రిప్రెషన్'కు లోనైంది. కొన్నాళ్లకు కాలేజీ మానేసింది.
న్యూఢిల్లీ : దేశంలో అనేక నగరాల్లో 'స్వాతి' లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. స్వాతి విషయంలో ఆమె బారుఫ్రెండ్ చేసింది లైంగికనేరమే. ఈ నేరాన్ని చేసినందుకు 'బారుఫ్రెండ్' శిక్ష అనుభవించాలి. కానీ దీనికి విరుద్ధంగా చుట్టూ ఉన్న ప్రపంచం స్వాతినే నిందించింది. మరికొంత మంది నుంచి లైంగికదాడికి గురైంది. ఇలాంటి 'లైంగిక నేరాలు' అటు పాఠశాలల్లో, ఇటు కాలేజీల్లో నేడు పెరిగిపోయాయి. ఈ ఘటనలు తమ దృష్టికి వస్తే పాఠశాల యాజమాన్యం గప్చుప్గా మూసేస్తున్నది. అండగా నిలబడి పోలీస్ స్టేషన్కు వచ్చి కేసులు నమోదుచేస్తున్నవారు చాలా తక్కువ.
కాస్త స్నేహంగా మెదిలిన సందర్భాల్లో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి..వాటిని వీడియో షూట్లకు కలిపి..అశ్లీలంగా మారుస్తున్నారు. తమను కాదన్న అమ్మాయిలపై కొంతమంది అబ్బాయిలు ఇలా ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నారు. ఆ విధంగా మార్చిన ఫొటోలను, వీడియోలను స్కూలు, కాలేజీ స్నేహితులకు పోస్ట్ చేస్తున్నారు. తద్వారా ఆ అమ్మాయిపై వేధింపులకు దిగుతున్నాడు. 'చూడు...నన్ను కాదన్నందుకు నీ బతుకేమవుతుందో..' అన్న ప్రతీకారాన్ని ప్రదర్శిస్తున్నారు. అనంతరం అనేక పుకార్లు రావటం, కనిపించవారంతా అదోరకంగా చూడటం...బాధిత అమ్మాయిని, వారి తల్లిదండ్రుల్ని తీవ్రంగా వేధిస్తోంది.
తమ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకొని, అండగా నిలబడే తల్లిదండ్రులు చాలా చాలా తక్కువ. 'వాడితో ఎందుకు తిరిగావు..', 'ముందు నువ్వు ఫొటోలు పంపావు కాబట్టి నీదే తప్పు' అనే ధోరణిలో చాలా మంది తల్లిదండ్రులు మాట్లాడుతున్నారని ప్రముఖ మీడియా సంస్థ జరిపిన శోధనలో తేలింది. తోటి స్నేహితురాళ్లు బారుఫ్రెండ్స్ను కలిగివుంటున్నారని, బారుఫ్రెండ్స్తో 'అతి సాన్నిహిత్యం' ఫరవాలేదన్న అభిప్రాయం ఆ అమ్మాయిల్లో ఏర్పడుతోందని, ఇదే వారికి ముందు ముందు సమస్యల్ని తెచ్చిపెడుతోందని చెన్నైలోని ప్రముఖ సైకాలజిస్టు డా.లతా జానకి అభిప్రాయపడ్డారు. ''తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహంగా ఉంటే, ఇలాంటి లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయగలం. వేధింపులు ఎదురైనప్పుడు బాధిత అమ్మాయికి వారి తల్లిదండ్రులు అండగా నిలబడి... ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. ఒకవేళ బాధిత యువతి మానసికంగా కుంగిపోతే వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాలి'' అని లతా జానకి చెప్పారు.
ఇంతకీ చట్టం ఏం చెబుతోంది?
- 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్-2012' (పీఓసీఎస్ఓ) చట్టం ప్రకారం, సామాజిక మాధ్యమంలో టీనేజీ అమ్మాయిలపై వేధింపులకు దిగితే...సెక్షన్ 354(డీ) ప్రకారం మూడేండ్లవరకూ జైలు శిక్ష విధిస్తారు.
- సైబర్ ప్రపంచంలో బెదిరింపులు, వెంటబడటం, మరొకరు పంపిన ఫొటోలను, సందేశాలను చూసి...ఆ అమ్మాయికి అశ్లీల సందేశాలు పంపటం నేరంగా పరిగణిస్తారు. బాలబాలికలతో పోర్నోగ్రఫీ రూపొందించటం తీవ్రమైన నేరం. దీనికి ఐదేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
- ఈ చట్టాన్ని అమలుజేసిన తొలి రాష్ట్రం తమిళనాడు. మరికొన్ని రాష్ట్రాలు కూడా దీనిని అమల్లోకి తెచ్చాయి. కానీ పోలీసులు సైబర్ వేధింపుల్ని అడ్డుకోవటంలో విఫలమవుతున్నారు.
- 2016లో ఈ చట్టం కింద తమిళనాడులో 1583 కేసులు నమోదయ్యాయి. చెన్నైలో 156, విల్లుపురంలో 105, వెల్లూరులో 99 కేసులు నమోదయ్యాయి. నేరం తీవ్రతను బట్టి నిందితులపై అత్యాచార కేసును కూడా నమోదుచేయవచ్చు.
- తమిళనాడులో ఇదే చట్టం కింద 1169, చెన్నైలో 96, విల్లుపురంలో 93, వెల్లూరులో 74, ట్యుటికోరిన్లో 60 అత్యాచార కేసులు నమోదుచేశారు. అయితే ఈకేసుల్లో విచారణ, శిక్ష పడటం తదితర వివరాలు అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు పలు రాష్ట్రాల పోలీసుల తీరును 'కేంద్ర నేర గణాంకాల విభాగం' తప్పుబట్టింది.