Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్లో దారుణం
- హర్యానాలో మరో బాలికపై...
లక్నో, చంఢగీఢ్: ఉత్తరప్రదేశ్లో మహిళలపై అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. గర్భిణిని కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. పోలీసుల వివరాల ప్రకారం.. యూపీలోని బడావున్ జిల్లా కచులా గ్రామానికి చెందిన ఓ గర్భిణి శుక్రవారం ఉదయం ఆరు బయటకు వెళ్లారు. కాగా.. ఆమెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె కాళ్లు చేతులు కట్టివేసి, నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి ఒడిగట్టారు. బయటకు వెళ్లిన మహిళ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని వారు గుర్తించారు. బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీనియర్ ఎస్పీ చంద్రప్రకాశ్ వెల్లడించారు.
నడుస్తున్న కారులో...
ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లో సామూహిక లైంగికదాడి ఘటనలు ఆగటంలేదు. తాజాగా సోహన్ రోడ్లోని వ్యవసాయపనిలో ఉన్న మైనర్ బాలికను ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి..కారులో దారుణానికి ఒడిగట్టారు. ఫరీదాబాద్లో గత ఆరురోజుల్లో ఐదో అఘాయిత్యం కావటం గమనార్హం.సెక్టార్..55 పోలీస్స్టేషన్ పరిధిలో వరుసకు పిన్నితో కలిసి మైనర్ బాలిక పొలం కోత పనుల్లో ఉన్నది. అక్కడనుంచి ఆ బాలికను అపహరించుకువెళ్ళి.. కారులోనే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లగా.. నడవలేని స్థితిలో ఇంటికెళ్లింది. జరిగిన దారుణానికి బంధువులకు తెలియజేయటంతో..పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరతకుముందు పోలీసులు ఈ దారుణాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మీడియా జోక్యం చేసుకున్నాక.. కేసు నమోదు చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ అమితాబ్ ధిల్లో మాట్లాడుతూ.. మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఆ మగ్గురు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారని తెలిపారు.