Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ ఎన్నికల్లో 9 అధ్యక్ష స్థానాలు కాంగ్రెస్ వశం
- రాఘోఘర్లో అధికార పార్టీకి భంగపాటు
భోపాల్: మధ్యప్రదేశ్ మున్సిపల్, నగర పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. పార్టీ ఉనికి అంతగా లేని రాష్ట్రంలో 20 అధ్యక్ష స్థానాలకు గానూ 9 సీట్లను గెలుచుకున్నది. ఇక అధికారంలో ఉన్న బీజేపీ కూడా 9 స్థానాలను మాత్రమే గెలుచుకున్నది. ఇతరులు ఓ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మరో స్థానానికి(సెమ్రియా) కౌంటింగ్ జరగలేదు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మున్సిపల్, నగర పరిషత్ ఎన్నికలు ఈనెల 17న జరగగా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. కౌన్సిల్ స్థానాల్లో బీజేపీ 194, కాంగ్రెస్ 145, ఇతరులు 13 సీట్లలో విజయం సాధించారు. రాఘోఘర్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీ బీజేపీకి భంగపాటు ఎదురైంది. అక్కడ ఆ పార్టీ కేవలం 4 వార్డుల్లోనే విజయం సాధించగా, కాంగ్రెస్ 20 వార్డులను కైవసం చేసుకున్నది.