Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాలకు మోడీ పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో ఏకకాలంలో ఎన్నికలు జరిపే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి మద్దతివ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తరుచూ నిర్వహిస్తున్న ఎన్నికల కారణంగా పెద్ద మొత్తంలో ఆర్థిక, మానవ వనరులను ఉపయోగించాల్సి వస్తోందన్నారు. రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేస్తే ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని ఆయన చెప్పారు. జాతీయ స్ధాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో ఒంటరిగా ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా సఫలీకృతం కాలేవని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తేనే ఏకకాలంలో ఎన్నికలు సాధ్యమని ఆయన చెప్పారు. ఒక ప్రముఖ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ఇంటర్వ్యూలో భాగంగా త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై ప్రశ్నించగా అభివృద్ధి ఒక్కటే ఎన్డీయే ప్రభుత్వం ఇవ్వగల సందేశమన్నారు.