Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 46 దాడి ఘటనలు...
- 27 పోలీస్ కేస్ యాక్షన్ ప్రెస్ ఫ్రీడమ్ నివేదిక 2017
న్యూఢిల్లీ : ఫొటోగ్రాఫర్లు, స్ట్రింగర్లు సహా జర్న లిస్టులకు 2017 ఒక భయానకమైన ఏడాదిగా చరిత్రలో నిలిచింది. 'ఇండియా ఫ్రీడమ్ రిపోర్టు: మీడియా ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్' పేరుతో 'ద హూట్' జర్నలిస్టులపై దాడులకు సంబం ధించి విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. గత ఏడాది 11 మంది పాత్రికే యులు హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జర్నలిస్టులపై 46 దాడులు జరిగాయి. 27 కేసుల్లో పోలీసులు అరెస్టులు, కేసుల దాఖలు వంటి చర్యలు తీసుకున్నారు. లంకేశ్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేశ్ బెంగళూరులో తన నివాసంలో సెప్టెంబరులో దారుణ హత్యకు గురయ్యారు.
త్రిపురలో న్యూస్ చానెల్ 'దిన్ రాత్' రిపోర్టర్ శంతన్ భౌమిక్, సీనియర్ జర్నలిస్టు సియాదాన్ పత్రిక సీనియర్ జర్నలిస్టు సుదీప్ దత్తా భౌమిక్ హత్యకు గురయ్యారు.పాత్రికేయులు అత్యధికంగా పోలీసులు, రాజకీయ నాయకుల నుంచి ఎదుర్కొన్న దాడులే అధికంగా ఉండటం గమనార్హం. 2017 ఆగస్టులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్టు నేపథ్యంలో చెలరేగిన హింసాకాండలో గాయపడినవారిలో పాత్రికేయులు కూడా ఉన్నారు. ఈ హింసాకాండలో టెలివిజన్ వ్యాన్లకు నిప్పటించడంతోపాటు రిపోర్టర్లు, కెమెరామెన్లు గాయాలపాలయ్యారు.
పరువు నష్టం
మహారాష్ట్రలో అత్యధికంగా 19 పరువునష్టం కేసులు 2017లో నమోదయ్యాయి. ఇందులో చలనచిత్ర మరియు టీవీ ప్రముఖులు దాఖలు చేసినవి ఐదు ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీసీఎఫ్) మాచీ చీఫ్ పెహ్లాజ్ నిహలానీ పరువునష్టం కేసును దాఖలు చేశారు. ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీని నడుపుతున్న సమీక్షా ట్రస్ట్ ఎడిటర్, ఇతర జర్నలిస్టులకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ పరువు నష్టం కేసును దాఖలు చేసింది. బీజేపీ నేత లోక్నాథ్ ఖాడ్సేతో దావూద్ ఇబ్రహీంకు సంబంధాలున్నాయంటూ వార్త ప్రచురించిన ముంబయిలోని ఓ పాత్రికేయునిపై పోలీసులు రెండుకేసులు నమోదుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అమిత్ షా తనయుడు ఆస్తులు భారీగా పెరిగినట్టు వార్తను ప్రచురించిన 'ద వైర్'లో ప్రచురించిన వార్త కథనం నేపథ్యంలో జైషా 100 కోట్లకు పరువునష్టం దావా నమోదుచేశారు.
న్యూస్ సెన్సార్షిప్
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో మీడియాను అనుమతించని ఘటనలు చోటుచేసుకున్నాయి. మీడియాను నియంత్రించిన జాబితాలో గోవా, జమ్మూకాశ్మీర్, కేరళ, ఒడిషా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలన్నాయి.
గోవాలో మనోహర్ పారికర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలతో సెక్రటేరియటల్లోకి కొన్ని మీడియా సంస్థలను అడ్డుకున్నారు.
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో గూర్ఖాలాండ్ నిరసనల నేపథ్యంలో జూన్లో ఎలక్ట్రానిక్ మీడియాను ఆ ప్రాంతంలోనికి అనుమతించలేదు. ముందస్తు అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడవద్దంటూ జూన్లో ఒడిషాలోని నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాజస్థాన్లో వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 'క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ (సీఆర్పీసీ) 1973ను సవరణ బిల్లు'ను తీసుకొచ్చింది. ప్రజా సేవకులు, న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్లపై వచ్చే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలేకుండా వార్తలు రాయకూడదు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వసుంధర ప్రభుత్వం ఆ బిల్లును వెనక్కి తీసుకుంది. జమ్మూకాశ్మీర్లోని గత డిసెంబరులో వార్తల కవరేజీ ఆ రాష్ట్రప్రభుత్వం అడ్డుకుంది.
రాష్ట్రం పరువు నష్టం దాఖలు
ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ 1
అస్సాం 1
ఢిల్లీ 11
గోవా 1
గుజరాత్ 2
హిమాచల్ ప్రదేశ్ 1
జమ్మూ కాశ్మీర్ 1
కర్నాటక 6
కేరళ 1
మధ్యప్రదేశ్ 2
మహారాష్ట్ర 19
మిజోరం 1
ఒడిషా 1
పంజాబ్ 1
తమిళనాడు 7
త్రిపుర 1
ఉత్తరప్రదేశ్ 2
పశ్చిమ బెంగాల్ 4
మొత్తం 63
పాత్రికేయులపై జరిగిన దాడుల సంఖ్య
నేరస్తులు దాడులు
పోలీసులు 13
రాజకీయనాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు 10
గుర్తుతెలియని దుండగులు 6
హిందూత్వవాద సంస్థలు, సభ్యులు 3
విద్యార్థి సంఘాలు 1
బ్యాంకు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రయివేటు భద్రతా సిబ్బంది 2
ఇసుక మైనింగ్ మాఫియా 2
వైద్యులు, వైద్య అధికారులు 2
దేరా సచ్ఛా సౌద సభ్యులు / అధికారులు 2
లిక్కర్ మాఫియా 1
ఔషధ వ్యాపారులు 1
ట్రేడ్ యూనియన్లు 1
విశ్వవిద్యాలయ అధికారులు 1
ప్రభుత్వ అధికారులు 1
మొత్తం 46