Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక ఎన్నికల ప్రచారంలో మోడీ బిజీ
అహ్మదాబాద్ : భారతదేశం అనగానే సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు అని కొలుస్తారు. ఇతరదేశాలనుంచి వచ్చే వారికి ఆతిథ్యం ఇవ్వటంలోనూ అంతే ప్రాధాన్యత ఇస్తారని విదేశీయులు భావిస్తుంటారు. కానీ మోడీ వ్యవహారశైలి కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడోకి అంతుచిక్కటంలేదు. పైగా మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కెనడా ప్రధాని టూర్కు వెళితే.. నరేంద్ర మోడీ హ్యండ్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఎనిమిది రోజుల పర్యటన నిమిత్తం కెనడా ప్రధాని భారత్కు వచ్చారు. ఇక్కడ భారతీయత గురించి ఘనంగా విన్న ఆయన కుటుంబసమేతంగా హస్తినలో అడుగుపెట్టారు. 'కెనడా ప్రధాని వస్తే.. భారత ప్రధాని అస్సలు పట్టించుకోలేదంటూ' ఆ దేశ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి. గుజరాత్ ఎన్నికపుడు జపాన్ ప్రధాని షింజో అబే, ఆ తర్వాత ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్యాహు, అంతకు ముందు చైనా అధ్యక్షుడు జిన్పింగ్లను మోడీ తీసుకెళ్లి మరీ పలు ప్రారంభోత్సవాలు చేశారు. అదే కెనడా ప్రధాని ట్రుడో విషయంలో మోడీ అలా ఎందుకు వ్యవహరిస్తు న్నారో అంటూ అక్కడి మీడియా కథనాలు వచ్చాయి. అయితే మోడీకి కావాల్సింది కర్నాటక రాజకీయం. అక్కడ ఎన్నికలు జరుగు తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం వైపు దృష్టిపెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్లో కీలక ఎన్నికలు లేవు కాబట్టి..కెనడా ప్రధానితో కలిసి సొంత రాష్ట్రానికి వెళ్లటానికి మోడీ ఆసక్తిచూపలేదని స్పష్టమవు తున్నది. ఇక ఎలాగో గుజరాత్ వచ్చాం కాదా.. అని ట్రుడో ఫ్యామిలీ సబర్మతి ఆశ్రమంలో కలియతిరిగారు. కుటుంబసభ్యులంతా గాంధీ చరఖా చూసి అచ్చెరువుచెందారు. కెనడాలో నివసిస్తున్న భారతీయుల గురించి మోడీ చర్చిస్తారని భావించారు. కానీ అందుకు భిన్నంగా కర్నాటక ఎన్నికల ప్రచారంలో మోడీ బిజీ అయిపోవటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.