Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కుమారుడు జరుషా వ్యాపార కార్యకలాపాలపై ది వైర్ న్యూస్ పోర్టల్ ఎలాంటి వార్తలు ప్రచురించకుండా గతంలో కింది కోర్టు విధించిన ఆంక్షలను గుజరాత్ హైకోర్టు పునరుద్ధరించింది. ది గోల్డెన్ టచ్ ఆఫ్ జరు అమిత్షా పేరు తో ది వైర్ వెబ్సైట్ ప్రచురించిన వార్తపై గతేడాది నవంబర్ 28న అహ్మదాబాద్లోని సివిల్ కోర్టు ఆంక్షలు విధించింది. వెబ్సైట్ యాజ మాన్యంతోపాటు కథనం రాసిన జర్నలిస్ట్పై జరుషా పరువు నష్టం దావా వేయడంతో కోర్టు ఆంక్షలు విధించింది. అయితే, వెబ్సైట్ యాజమాన్యం ఆంక్షల తొలగింపును కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించగా గతేడాది డిసెంబర్ 23న అందుకు అంగీకరించింది. కానీ, జరుషా అనూహ్య సంపదతో ప్రధాని మోడీకి లింక్ చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది.