Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటానగర్: మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడి చంపేసిన కేసులో పోలీసు స్టేషన్లో ఉన్న ఇద్దరు నిందితులను లాకప్నుంచి బయటకు లాగి దాదాపు 1000మంది కొట్టి చంపేశారు. అరుణాచల్ప్రదేశ్లోని తేజు పట్టణంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. నిందితులు సంజరు సోబర్(30), జగదీశ్ లోహర్(25)లు ఈ నెల 12న నాంగో గ్రామానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశారు. అనంతరం నాంగో గ్రామంలోని తేయాకు తోట సమీపంలో బాధితురాలి మొండెం, తల రెండు వేర్వేరుగా లభ్యమయ్యాయి. ఈ నెల 18న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు లాకప్నుంచి నిందితులను దాదాపు 1000మంది గుంపుగా లాక్కెళ్లారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆయిద్ అపూర్ బితిన్ తెలిపారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులకూ గాయాలయ్యాయని పేర్కొన్నారు. లైంగికదాడిని ఆటవిక చర్యగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖండూ వ్యాఖ్యానించారు. ఇద్దరు నిందితుల మరణాలు దురదృష్టకరం అని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని మన న్యాయవ్యవస్థ ఒప్పుకోదని చెప్పారు. ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ విధించామని, న్యాయవిచారణకు ఆదేశించామని తెలిపారు.