Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాన్పై పలువరు వైసీపీి సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిన రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చొక్కా పట్టుకుని నిలదీస్తానని చెప్పిన జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నింపాదిగా లెక్కలడుగుతురని వైసీపీి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అన్నింటికీ సిద్ధమే అని జగన్ ప్రకటించిన తరువాత అవిశ్వాసం పెట్టమని పవన్ ఉచిత సలహా ఇస్తున్నాడన్నారు. చంద్ర బాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వగానే పవన్ రంగంలోకి వస్తున్నాడని దీనితో అసలు సమస్య పక్కదారి పడుతోందన్నారు. వైసీపీి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడిలా వ్యవహరిస్తు న్నారని పేర్కొన్నారు. అవిశ్వాసానికి 'మీ పార్టనర్ (టీడీపీ)'ను ఒప్పించమని పవన్ను ప్రతిపక్ష నేత జగన్ కోరారని అంతేకానీ ఎక్కడా సవాల్ చేయలేదన్నారు. ముఖ్యమంత్రిపై పోరాడాల్సిన పవన్ ప్రతిపక్షాలను ప్రశ్నించడంలో ఆంతర్యమేమిటన్నారు. ఇప్పటికైనా ఆయన వైఖరిని స్పష్టం చేయాలన్నారు.
టీడీపీిలో దళితులపై పెరిగిన నేరాలు : మేరుగు నాగార్జున
టీడీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగు నాగార్జున విమర్శించారు.