Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతన్నకు భరోసానివ్వని కేంద్ర బడ్జెట్
- పలు పథకాలకు భారీగా తగ్గిన నిధులు
- 15 విభాగాలకు కేటాయింపుల్లో కోత
- పరిశోధనలపై మోడీ సర్కారు చిన్నచూపు
నవతెలంగాణ-జనరల్ డెస్క్
కర్షకుల సంక్షేమాన్ని కాంక్షించేలా 2018-19 కేంద్ర బడ్జెట్ ఉందంటూ బీజేపీ నేతలు గొప్పలు చెప్పు కుంటున్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సైతం ఆహా..ఓహో అంటూ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఆకాశానికెత్తారు. కానీ, పార్లమెంటులో విత్త మంత్రి చెప్పిన మాటలకు, వ్యవసాయ రంగానికీ కేటాయించిన నిధులకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. రైతులకు రూ.11లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న జైట్లీ.. రుణమాఫీ ఊసే ఎత్తలేదు. ఈ 11 లక్షల కోట్లు బడ్జెట్ పరిధిలోకి రాదన్నది జనానికి తెలియని విషయమేం కాదు. పైగా అన్నదాతల ఆదా యాన్ని రెట్టింపు చేస్తామంటూ మాటలతో మభ్యపెడుతు న్నారు. వ్యవసాయ రంగంలోని కీలక విభాగాలకు నిధుల్లో కోత పెట్టారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేటాయింపుల్లో(రూ.55 వేల కోట్లు) గతేడాదితో పోలిస్తే ఎలాంటి మార్పూ లేదు. వ్యవసాయ పరిశోధనలపై మోడీ సర్కారు ఎనలేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఈ విభాగానికి గత బడ్జెట్లో రూ.6,111 కోట్లు కేటాయించగా.. ఈసారి 2,914.77 కోట్లతోనే సరిపెట్టింది. పరిశోధనల విభాగంలో తొమ్మిది శాఖలుండగా.. ఏడింటికి నిధుల్లో కోత పడింది. మొత్తంగా బడ్జెట్ కేటాయింపులు చూస్తే రైతుల ఆదాయం రెట్టింపు సాధ్యమయ్యేనా? అన్న అనుమానం కలగక మానదు.