Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్లో ఘటన
జైపూర్: వారసుడి కోసం ముప్ఫై ఏండ్ల యువతితో రెండో పెండ్లికి సిద్ధమయ్యాడు ఓ వృద్ధుడు. ఇందుకు ఆయన మొదటి భార్య కూడా అంగీకారం తెలిపింది. ఈ ఘటన రాజస్థాన్లోని సమ్రదా గ్రామంలో చోటు చేసుకుంది. రాజస్థాన్లోని కార్వాలి జిల్లాకు చెందిన సుక్రమ్ బైరవ(83) కు భార్య బట్టో, పెండ్లైన ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 20 ఏండ్ల క్రితం వారి కొడుకు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే తన మరణాంతరం వంశపారంపర్యంగా వస్తున్న ఆస్థిని చూసుకోవడానికి వారసుడు కావాలనుకున్నాడు. దాంతో ఓ యువతి(30) తో వివాహానికి సిద్ధమయ్యాడు. వారసుడి కోసం బైరవ రెండో పెండ్లికి ఆయన భార్య అంగీకరించింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల, గ్రామస్థుల సమక్షంలో వారి పెండ్లి తంతు ముగిసింది. ఈ ఘటన పై తహసీల్దార్ నేతృత్వంలో విచారణకు ఆదేశించామని జిల్లా పరిషత్ చీఫ్ సురేంద్ర మహేశ్వరి చెప్పారు.