Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎమ్మెల్యేల దాడి
- కేజ్రీవాల్ సమక్షంలోనే : సీఎస్ అన్షు ప్రకాశ్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో ఆయన చూస్తుండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు తనపై దాడి చేశారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రణాళికల గురించి చర్చించేందుకు సోమవారం సాయంత్రం సీఎం ఇంటికి వెళ్లిన తనపై ఎమ్మెల్యేలు అజిత్ దత్, ప్రకాశ్ జార్వల్ దాడి చేశారని అన్షు ప్రకాశ్ చెబుతు న్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇంటికి వెళ్లినట్టు సమాచారం.దీంతో,ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వల్ను ఢిల్లీ పోలిసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.కాగా.. చీఫ్ సెక్రటరీ అన్షు ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అన్షుపై ఎలాంటి దాడి గానీ.. దాడికి యత్నంగానీ జరగలేదని కేజ్రీవాల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. చీఫ్ సెక్రటరీ ఆరోపణ ల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వెంటనే విచా రణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడిన ఆప్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకో వాలని ఐఏఎస్లు కోరుతున్నారు. ఈ మేరకు మంగ ళవారం వారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ''నిధుల ఖర్చు ల విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించింది. దానిని సీఎస్ ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు'' అని వారు వివరిం చారు. ఆప్ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని రాష్ట్రంలో అధికారులకు రక్షణే లేకుండా పోయిందం టూ వారు లెఫ్ట్నెంట్ గవర్నర్ వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యే చెయ్యి చేసుకోవటం విమర్శలకు దారితీస్తోం ది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
సీసీ ఫుటేజీలు ఉన్నాయా ?
కాగా, సీఎస్పై దాడి జరిగిందన్న వార్తలపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఆయనపై ఎమ్మెల్యేలెవరూ దాడి చేయలేదని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సమావేశంలో అన్షునే ఎమ్మెల్యేలను దుర్భాషలాడారని.. తాను కేవలం లెఫ్టినెంట్ గవర్నర్కు మాత్రమే జవాబుదారీనంటూ సమావేశం నుంచి సీఎస్ అర్థాంతరంగా వెళ్లిపోయినట్టు ఆ ప్రకటన పేర్కొంది. సీఎస్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడని.. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని ఆప్ నేతలు చెబుతున్నారు.