Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి నుంచి టీచర్స్ అసోసియేషన్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో సిబ్బంది తొలగింపును నిరసిస్తూ అధ్యాపకులు, విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి సత్యాగ్రహ పేరుతో నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు జేఎన్యూ టీచర్స్ అసోసియేషన్ వెల్లడించింది. వర్సిటీలో ఇటీవల అమల్లోకొచ్చిన తప్పనిసరి హాజరీ విధానాన్ని అమలు చేయడం లేదన్న కారణంతో పలు విభాగాల్లోని డీన్లు, చైర్పర్సన్లను యాజమాన్యం తొలగించింది. అయితే.. సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. వర్సిటీ యాజమాన్యం..సిబ్బందిపై అక్రమంగా చర్యలు తీసుకోవడమే కాక, వారిని వేధింపులకు గురి చేస్తున్నదని ఆరోపిస్తున్నది. వర్సిటీ అక్రమంగా జారీ చేసిన సర్క్యూలర్లను ఈనెల 21లోగా వెనక్కి తీసుకోకుంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.