Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్లో ఘటన
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని కత్వా జిల్లాలో దేశ తొలి ప్రధాని జవహర్లాల్నెహ్రూ విగ్రహంపై గుర్తుతెలియని కొందరు వ్యక్తులు నల్ల రంగు పోసి విధ్వంసం సృష్టించారు. కత్వాలోని టెలిపోన్ మైదాన్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహంపై శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దానిని శుభ్రం చేయించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయంతో విగ్రవీగిన ఆ కార్యకర్తలు అక్కడి లెనిన్ విగ్రహ విధ్వంసంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహాదాడులకు కాషాయ మూకలు తెరలేపిన విషయం తెలిసిందే.
బీహార్లో అంబేద్కర్ విగ్రహం
బీహార్లోని బేగుసరైలో గుర్తుతెలియని వ్యక్తులు కొందరు వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి మసిపూసారు. గత 12 రోజుల్లో ఇది ఏడో ఘటన కావడం గమనార్హం.