Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.15.45 కోట్ల కేంద్ర నిధుల్ని నష్టపోయిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 51వేలమంది ఎస్సీ,ఎస్టీ విద్యార్థినులు రూ.15.45 కోట్ల ప్రోత్సా హక నిధుల్ని కోల్పోయారు. సెకండరీ పాఠశాలల్లో చదివే 14-18 ఏండ్ల వయ సు విద్యార్థినుల కోసం జాతీయ ప్రోత్సా హక పథకాన్ని 2008-09లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బాలికల డ్రాపవుట్స్ను తగ్గించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. ఒక్కో విద్యార్థిని ఖాతాలో ఏటా రూ.3000 జమ చేయాలి. అయితే, కేంద్రం నుంచి తమిళనాడుకు దాదాపు 51వేలమంది విద్యార్థినుల కోసం విడుదల చేసిన రూ.15.45 కోట్లను వెనక్కి పంపించినట్టు తేలింది. దీనిపై పరిశీలన జరపగా..విద్యార్థినుల బ్యాంక్ ఖాతాల వివరాలను (ఐఎఫ్ఎస్సీ కోడ్, వగైరా) సమర్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని స్పష్టమైంది.