Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి రైల్వే వెల్లడి
ముంబయి: గడిచిన మూడేండ్లలో దేశంలోని సబర్బన్ రైల్వే పరిధిలో జరిగిన ప్రమాదాల్లో 9,520 మంది మృతి చెందినట్టు ముంబయి రైల్వే పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది. వీటిలో రైల్వే లైన్ దాటుతున్నప్పుడు, రైలు నుంచి దిగుతుండగా జరిగిన ప్రమాదాలే అధికంగా ఉన్నాయని తెలి యజేసింది. అధికారిక లెక్కల ప్రకారం.. పట్టాలు దాటుతున్నప్పుడు జరి గిన ప్రమాదాల్లో 5,250 మంది మృతి చెందగా, రైల్లోంచి కిందికి దిగు తుండగా చోటు చేసుకున్న ప్రమాదాల్లో 2,117 మంది చనిపోయారు. ఇవేకాక రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే పోల్లకు తాకి 2,117 మంది మరణించారు. మొత్తంగా 2015లో 3,304 మంది, 2016లో 3,202 మంది, 2017లో 3,014 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు వెల్లడించాయి. సబర్బన్ రైల్వే దేశ వ్యాప్తంగా 2,979 రైలు సర్వీసులతో నిత్యం 76 లక్షల మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది.