Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బీజేపీతో మిత్రబంధం తెంచుకున్న తెలుగుదేశం పార్టీ.. ఏపీకి ప్రత్యేక హౌదా కోసం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసింది. తర్వాత బీజేపీతో పొత్తును ఉపసంహరించుకున్నది. తాజాగా అవిశ్వాసం తీర్మానం పెట్టైనా హౌదా సాధించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం నోటీస్ ఇచ్చింది. ప్రత్యేక హౌదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేసింది. అయితే ఆ రోజు సభ ఆర్డర్లో లేకపోవడంతో లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో సోమవారం రోజు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ ఎంపీలు తప్పసరిగా సభకు హాజరుకావాలని విప్ జారీ చేసింది.