Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గువహతి : శారదా చిట్ఫండ్ స్కామ్ ప్రధాన నిందితుడు సుదీప్త సేన్, సహ నిందితుడు దేబ్జనీ ముఖర్జీకి ప్రత్యేక కోర్టు శుక్రవారం 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కోల్కతా జైలు నుంచి గువహతికి వారిని తీసుకు వచ్చి విచారణ జరిపిన తరువాత కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 2014లో వీరిపై కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితులిద్దరిని కోర్టులో ప్రవేశపెట్టింది. సేన్పై ఇటువంటివే మరికొన్ని ఇతర కేసులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి 2013లో కాశ్మీర్లోని సోన్మార్గ్లో సేన్ను అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్, ఒడిషాతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి.