Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల చేసిన కేంద్ర మంత్రి గెహ్లాట్
న్యూఢిల్లీ : మూగ, చెవిటి వారికోసం తొలి భారతీయ పదకోశం (డిక్షినరీ) వచ్చేసింది. 3 వేల హిందీ, ఇంగ్లీష్ పదాలకు కేవలం సంజ్ఞలు, గుర్తులు, చిహ్నాల రూపంలో అర్థాల్ని ఈ పదకోశంలో తెలియజేశారు. దేశంలోనే మొట్టమొదటి 'భారతీయ భాషా చిహ్న పదకోశం' పుస్తకాన్ని కేంద్ర మంత్రి థావర్చాంద్ గెహ్లాట్ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలోని మూగ, చెవిటి వారికోసం, వారితో మిగతా సమాజానికి మధ్య ఏర్పడ్డ సమాచార అంతరాన్ని తొలగించటం కోసం 'భారతీయ భాషా చిహ్న పదకోశం'ను అభివృద్ది చేయాలన్నది తమ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగా తొలి పదకోశాన్ని విడుదలచేశామని అన్నారు.