Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసికందు సహా ఐదుగురు మృతి
- 30 మందికి తీవ్ర గాయాలు
పాట్నా: బీహార్లో విషాదం చోటు చేసుకున్నది. పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన దుర్ఘటనలో ఆరుగురు చనిపోగా.. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నెల రోజుల పసికందు సహా ముగ్గురు చిన్నారులున్నారు. పోలీసులు వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని నలంద జిల్లా జలాల్పూర్ ప్రాంతంలో సర్ఫరాజ్ అనే వ్యక్తి అక్రమంగా బాణాసంచా ఫ్యాక్టరీ నిర్వహిస్తూ అక్కడే నివాసముంటున్నాడు. ఇదిలా ఉంటే ఆ ఫ్యాక్టరీలో గురువారం అర్ధరాత్రి ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టపక్కల ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో సర్ఫరాజ్ ఇద్దరు కూతుళ్లు(ఒకరి వయస్సు నెల రోజులు), కొడుకు, సోదరి, మరో వ్యక్తి మృతి చెందారు.