Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 రాష్ట్రాలను వివరణ కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు లోకాయుక్తలను నియమించక పోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. లోకాయుక్తను ఏర్పాటు చేయకపో వడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని 12 రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు న్యాయమూర్తులు రంజన్ గోగోరు, ఆర్ భానుమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు లోకాయుక్త అమలు తీరుపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఒడిషా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్తను పనితీరు సజావుగా జరిగేందుకు సరిపడా బడ్జెట్ కేటాయించాలని, సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. లోకాయుక్తను ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో మణిపూర్, మేఘాలయ, తమిళనాడు, బెంగాల్తో పాటు తెలంగాణ కూడా ఉన్నది. లోక్పాల్, లోకాయుక్త చట్టం-2013లోని 63 సెక్షన్ ప్రకారం.. ప్రతి రాష్ట్రంలో లోకాయుక్తను విధిగా నియమించాలి. ఈ చట్టం 2014 జనవరి 16న అమల్లోకొచ్చింది. అవినీతికి సంబంధించిన కేసులను లోకాయుక్త విచారిస్తుంది. ఢిల్లీకి చెందిన అశ్వనీ కుమార్ ఉపాధ్యారు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.