Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ ఇచ్చే విషయమై ఏర్పడుతున్న గందరగోళానికి తెరదించాలంటూ మోడీ సర్కారుకు భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ సొమ్ముపై కేంద్రం వెల్లడిస్తున్న రకరకాల మార్గదర్శకాలతో లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారని న్యాయమూర్తులు మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. పింఛన్ సొమ్మును ఎలా నిర్ణయించాలన్న దానిపై కేంద్రానికి స్పష్టత లేదని అభిప్రాయపడింది. పింఛన్ విషయంలో రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఓ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్ సమస్యపై ఓ రైల్వే విశ్రాంత ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.