Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు నోటీసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా లైంగికదాడి ఘటనలో ఎనిమిదేండ్ల బాలిక గుర్తింపును బహిర్గతపర్చినందుకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వెబ్సైట్లు.. బాలిక గుర్తింపును బహిర్గతపర్చడమే గాక దేశ ప్రతిష్టకు భంగం కలిగించారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సప్లకు నోటీసులు జారీ చేసింది. 'మీరు చేసిన పని వల్ల దేశానికి, బాధితురాలి కుటుంబానికి అన్యాయం జరిగింది' అంటూ వెబ్సైట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాలిక గుర్తింపును బయట పెట్టినందుకు ఆ వెబ్సైట్ల మీద గత నెల 18న రూ. 10 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.