Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల తిరుపతి దేవస్థానంపై చెలరేగిన వివాదం ముదురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఈ వివాదంపై ఆదివారం స్పందించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఈ వివాదంపై సుప్రీంకోర్టుకెళతానని ప్రకటించారు. టీటీడీకి చెందిన పలువురు మాజీ అధికారులు, ఆర్కియాలజీ అధికారులు కూడా ఈ వివాదంపై పెదవి చెప్పారు. మరోవైపు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు బీజేపీ అధినేత అమిత్షాను కలిసినట్టు సోషల్మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
సుప్రీంకు వెళ్తా : సుబ్రహ్యణ్యస్వామి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల్ని తొలగించడంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టు ఆయన ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఈవిషయం వెల్లడించారు. టీటీడీలో ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరతానని తెలిపారు.
అంతా సవ్యం : చంద్రబాబు
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్య మంత్రి చంద్ర బాబు టీటీడీ వ్యవహా రంపై స్పందించారు. 'టీటీడీలో అంతా సవ్యంగా ఉంది. అక్రమాలు జరిగాయన్న దానిలో ఎటువంటి వాస్తవం లేదు. ఆడిటింగ్ జరిగింది. రికార్డు లన్నీ పక్కాగా ఉన్నాయి. టీటీడీి ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ, ఇప్పుడూ టీడీపీనే టీటీడీ ప్రతిష్టను కాపాడుతోంది' అని ఆయన అన్నారు.
ఆభరణాలకూ దిక్కులేదు : జగన్
'తిరుమల తిరుపతి దేవాలయంలోని ఆభర ణాలకే దిక్కులేదు. వాటిని కూడా దోచు కునే పరిస్థితి ఏర్పడింది. దేవాలయ ప్రతిష్టను కాపాడుతున్నామంటూ నే టీడీపీ ఈ పనిచేస్తోంది. ఇంత దారుణం గతం లో ఎప్పుడూ జరగలేదు. ఆలయ అబివృధ్ధికి కృషి చేయడానికి బదులుగా ప్రతిష్టను టీడీపీ దిగజారుస్తోంది. ఆ పార్టీ గతంలోనూ ఇలాగే వ్యవహరించింది' అని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పాదయాత్రలో ప్రతిపక్షనేత జగన్ అన్నారు.
చంద్రబాబే సమాధానం చెప్పాలి : పవన్
టీటీడీ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబే సమాధానం చెప్పాలని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సోమ వారం రాత్రి ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ వివాదంపై పవన్ స్పందించారు. టీటీడీపై రమణదీక్షితులు చేస్తున్న వ్యాఖ్యలను సమర్ధించారు. ఆయన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. శ్రీవారి ఆభరణాల్లో కొన్ని ఇజ్రాయెల్కు తరలిపోయినట్లు గతంలో తనకు ఓ అధికారి చెప్పినట్లు తెలిపారు.
1952 నుండి పింక్డైమండ్ లేదు : టీటీడీ మాజీ జేఈఓ ధర్మారెడ్డి
అపహరణకు గురయిన ట్టుగా చెబుతున్న పింక్డైమండ్ 1952 నుండి టీటీడీ వద్ద లేదని టీటీడీ మాజీ జేఈఓ ధర్మారెడ్డి చెప్పారు. 1952లోతొలిసారి ఆభరణాల జాబితా రూపొందించారని, అప్పటికే శ్రీకృష్ణదేవరాయులు ఇచ్చినట్టుగా చెబుతున్న ఆభరణాలు కూడా లేవని ఆయన తెలిపారు. పింక్ డైమండ్ లేదనే విషయాన్ని టీటీడీి ఇఓగా ఉన్నప్పడే ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి నివేదించినట్టు ఆయన తెలిపారు. వకుళమాత పోటు వద్ద ఎప్పుడూ 15-20 మంది కార్మికులు ఉంటారని,సీసీి కెమెరాలు నిరంతరం పనిచేస్తుంటాయని, ఒక్క నగ కూడా ఆభరణాల గది నుండి బయటకు పోయే వీలులేదని చెప్పారు.
ప్రతి అంశానికీ లెక్కలున్నాయి :మాజీ ఈఓ ఎల్వీసుబ్రహ్మణ్యం
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి దానికి లెక్కలు న్నాయని, రికార్డుల్లో అన్నీ పక్కాగా నమోదైఉన్నాయని మాజీ ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. రమణదీక్షితులు రెండు సంవత్సరాలుగా కైంకర్యాలకు దూరంగా ఉన్నారని, ఆయన మాటలకు లేని గౌరవాన్ని ఆపాదించ వద్దని అన్నారు.
రూబీనా.. డైమండా అన్నది తేలుస్తాం : ఆర్కియాలజీ డైరక్టర్ మునిరత్నం
రూబీనా, డైమండా అన్న విషయాన్ని తేలుస్తామని ఆర్కియాలజీ డైరక్టర్ ముని రత్నం తెలిపారు. దీనికోసం మైసూరు మహారాజును సంప్రదిస్తామని, అక్కడి రికార్డులు పరిశీలిస్తే ఈ విషయంపై స్పష్టత వస్తుందని చెప్పారు. రెండు అడు గులు తవ్వినంత మాత్రనా నేలమాళిగలు బయటపడవని వ్యాఖ్యానించారు.