Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్లో దారుణం
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సుకోసం ఎదురుచూస్తున్న ఓ మహిళను లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకుని ఆమెపై నలుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 1న ఘటన జరగ్గా..20రోజుల తర్వాత కేసు నమోదైంది. ఫిర్యాదులోని వివరాల ప్రకారం..మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి ప్రయాణమవడానికి బాధితు రాలు బస్సుకోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలో దూరపు బంధువు ఒకరు ఇంటి దగ్గర దింపుతానని నమ్మబలికి లిఫ్ట్ ఇచ్చాడు. అయితే కారులో నలుగురు వ్యక్తులున్నారని ఫిర్యాదులో తెలిపింది. నేరుగా ఇంటికి తీసుకెళ్ల కుండా ఆమెపై ఆ నలుగురు లైంగికదాడికి ఒడిగట్టారని వివరిం చింది. ప్రతిఘటించడానికి ప్రయత్నించగా ఆమెను కొట్టారని పేర్కొన్నది. కాగా, ఆ నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులకోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.