Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐకి హైకోర్టు ఆదేశం
లక్నో: ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి తండ్రి అనుమానాస్పద మృతిపై సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టడం లేదని బాధితురాలి తల్లి దాఖలు చేసిన వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని దర్యాప్తు ఏజెన్సీని అలహాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేసినట్టు చీఫ్ జస్టిస్ డిబి భోసలే, న్యాయమర్తి సునీత్ కుమార్ల బెంచ్ తెలిపింది. ఉన్నావ్ కేసు నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్.. బాధిత యువతి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించారనే ఆరోపణలతో సెంగార్పై తాజాగా శుక్రవారంనాడు సీబీఐ కేసు నమోదు చేసింది. ఉన్నావ్ కేసును పోక్సో చట్టం కింద.. స్థానిక కోర్టు చేపడుతున్న విచారణపై హైకోర్టు సోమవారంనాడు స్టే విధించింది.