Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించండి.. : జస్టిస్ లోయా మృతి కేసుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ : న్యాయమూర్తి బీహెచ్.లోయా మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించా లని, ఈ కేసులో ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని కోరుతూ బాంబే న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ను వేసవి సెలవుల అనంతరం సుప్రీం పరిశీలిస్తుందని అసోసియేష న్ అధ్యక్షుడు అహ్మద్ అబెది ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా న్యాయవాదుల సంఘం అత్యున్నత న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చిన అంశాలు...''సంచలనం కోసం ఈ కేసును పదే పదే కోర్టు ముందుకు తీసుకురావటం లేదు. న్యాయమూర్తి జీవిత కాలంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. మేమంతా వారి వెనుక ఉన్నా మని చెప్పడానికి ఇదంతా చేస్తున్నాం. దాంట్లో భాగంగానే జస్టిస్ లోయా మృతి కేసుపై స్వతం త్ర దర్యాప్తును డిమాండ్ చేస్తున్నాం. తద్వారా మొత్తం న్యాయవ్యవస్థలో నెలకొన్న అనేక సందేహాలు తీరుతాయి. లోయా మృతిపై మహా రాష్ట్ర పోలీసులు ఇచ్చిన నివేదికపై మాకు సందేహాలున్నాయి'' అని రివ్యూ పిటీషన్లో తెలియజేశారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు విచారణ చేస్తున్న సమయంలో (డిసెంబరు 1, 2014) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీహెచ్.లోయా హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. జస్టిస్ లోయాది సహజమరణంగా కాదని 'ద కార్వాన్' మ్యాగజైన్ ప్రచురించిన కథనం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే కేసు సుప్రీంకోర్టు వరకూ చేరుకోవటం, లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తూ పిటిషన్లను కొట్టివే యటం జరిగింది.