Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో దళితుడి హత్య
- ప్రభుత్వం ఇంకా పాఠాలు నేర్చుకోలేదు : జిగేశ్ మేవాని
అహ్మదాబాద్: గుజరాత్లో 'ఉనా' తరహాలో దానిని మించిన మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ ముందున్న చెత్తను తీయాలని దళిత దంపతులను ఆదేశించగా.. డబ్బులు ఇవ్వబోరని గ్రహించి ఆ పని చేసేందుకు వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఫ్యాక్టరీ యజమానితో పాటు మరో నలుగురు ఆ దళితుడి (40)ని స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ ఘటన గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో ఆదివారం జరిగింది. బాధితులను సురేంద్రనగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ముకేశ్ వానియ, ఆయన భార్య జయబెన్ ఉపాధికోసం వెతుకుతున్నారు. రాజ్కోట్ జిల్లా లోని ఓ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్లగానే ఐదుగురు వ్యక్తులు వీరి వద్దకు చేరి అక్కడి చెత్తను ఏరవేయా లని ఆదేశించారు. కానీ అందుకు తమకు కూలి ఇవ్వరని తెలుసుకున్నాక ఆ పని చేసేందుకు నిరా కరించారని బాధితురాలు జయబెన్ తెలిపారు. 'మీరు తక్కువ కులానికి చెందినవారు..అది మీరు చేయాల్సిన పనేనని అన్నార'ని చెప్పారు. ఊడిగం చేసేందుకు నిరాకరించిన ఆ దంపతులపై వారు భౌతికదాడికి దిగారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని, తనను కొట్టారని జయబెన్ తెలి పారు. ఇంతలో ముకేశ్ అత్త సవితాబెన్ అక్కడికి వచ్చి గొడవను సద్దుమణిగిం చేందుకు ప్రయత్నిం చగా ఆమెనూ కొట్టారు. నిందితులు ముకేశ్ చుట్టు వలయంలా ఏర్పడి ఆయనపై దాడి చేశార ని ముకేశ్ తమ్ముడు చెప్పాడు. స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్తో సుమారు రెండు గంటలపైనే ముకేశ్ను తీవ్రంగా కొట్టినట్టు ఓ వీడియో ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఇంతలో ఇద్దరు మహిళలు ఊరిలోకి వచ్చి సహాయం కోరగా..ఇంటి యజ మాని సహా ఐదుగురు ఘటనాస్థలానికి చేరుకు న్నారు.
కానీ అప్పటికే తీవ్రంగా గాయపడిన ముకేశ్ను ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్ది సమయానికే పరిస్థితి విషమించి మరణించారు. గుజరాత్లో ని ఉనా లో 2016లో చనిపోయిన ఆవు తోలు వొలిచి నందుకు నలుగురు దళిత యువకులను కారుకు కట్టేసి చితకబాదిన విషయం తెలిసిందే. ఇది ఉనా ఘటన కంటే దారుణమైనదని ఎమ్మెల్యే జిగేశ్ మేవాని అన్నారు. గతకాలపు తప్పుల నుంచి ప్రభుత్వం ఇంకా గుణపాఠం నేర్చుకో లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి ఫ్యాక్టరీ యజమాని సహా నలు గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.