Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛత్తీస్గఢ్ : ప్రాక్టీస్కు వెళ్లి వస్తున్న ముగ్గురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణుల (మైనర్లు)పై ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుళ్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని కొండగావ్లో బుధవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన క్రీడాకారిణులు ప్రాక్టీస్కు వెళ్లి తిరిగి వస్తుండగా 29 వ బెటాలియన్కు చెందిన ముగ్గురు ఐటీబీపీ కానిస్టేబుళ్లు వారిని వెంబడించారు. ఫోన్ నెంబర్, ఇతరత్రా వివరాలు అడుగుతూ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మైనర్లలో ఒకరు వారి బంధువుకు ఫోన్ చేయడంతో కానిస్టేబుళ్లు అక్కడినుంచి పారిపోయారు.