Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో అధికంగా జవాన్ల మృతి
న్యూఢిల్లీ: పాకిస్థాన్, భారత్ సరిహద్దులో క్రాస్ ఫైరింగ్ ఘటనలు దాదాపు 300శాతం పెరిగాయి. ఈ ఘటనల్లో మృతి చెందుతున్న జవాన్ల సంఖ్య గత ఐదేండ్లలో ఈ ఏడాదే అధికంగా ఉన్నట్టు అధికారిక సమాచా రంలో తేలింది. మోడీ సర్కారు జవాన్ల మరణాలు తగ్గాయని అంటు ంటే..అందుకు భిన్నంగా భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోతున్నారన్న కఠోర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాదిలో నేటివరకు జమ్మూకాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 300 కాల్పులు, షెల్లింగ్ మోర్టార్ల ఘటనలు చోటుచేసుకోగా..అందులో ఐదుగురు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లు మృతి చెందారు. కాగా, గతేడాది 111 కాల్పులు జరగ్గా..ఇద్దరు జవాన్లు మృతి చెందారు. 2016లో 204 కాల్పులు జరగ్గా ముగ్గురు జవాన్లు మరణించారు. 2015లో 350 ఘటనల్లో ఐదుగురు జవాన్లు, 2014లో 127 ఘటనలు సంభవించగా ఇద్దరు జవాన్లు చనిపోయారు. కాగా, ఈ నెలలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది పౌరులు, ఇద్దరు జవాన్లు చనిపోయారు.