Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్మూలోని స్థానిక పోలీస్ స్టేషన్పై గురువారం రాత్రి జరిగిన గ్రెనెడ్ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు మరో పౌరుడు గాయపడ్డారు. ఈ దుశ్యర్యకు పాల్పడింది ఉగ్రవాదులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... జమ్మూ నగరంలో బస్టాండ్ వద్ద ఉన్న పోలీస్ స్టేషన్పై గురువారం రాత్రి 11:15 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న ఫ్లైఓవర్ పైనుంచి గుర్తు తెలియని దుండగులు గ్రెనెడ్ విసిరి పారిపోయారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసు సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు.