Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారతీయ పర్వతారోహకుడు అర్జున్ వాజ్పాయి అతి చిన్న వయసులో ఆరు పర్వతాలు ఎక్కి రికార్డు సాధించాడు. ప్రపంచంలోనే మూడవ అతి ఎత్తయిన 8,000 మీటర్ల కాంచనగంగ శిఖరాన్ని ఈ వారంలో అధిరోహించి ఈ ఘనతను సాధించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 24 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ను సాధించిన ఘనతను దక్కిం చుకున్నాడు. నోయిడాకు చెందిన వాజ్పారు కాంచన్గంగను మే 20న అధిరోహించడం ప్రారంభించి సంక్లిష్ట వాతావరణ పరిస్థితు ల్లోనూ తన లక్ష్యాన్ని పూర్తి చేశాడు. వాతా వరణం అనుకూలించ కపోవడంతో గురువారం ఉదయానికి కూడా అతను బేస్ క్యాంప్కు చేరుకోలేదని అధికారులు తెలిపారు. 2010లో 16 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహిం చిన మూడవ అతిచిన్న వయస్కుడు వాజ్ పారుగా రికా ర్డులకెక్కాడు. భారత్ కు చెందిన మౌంటెన్ డ్యూ రిస్క్ టేకర్స్ ఆఫ్ ఇండియా' తన సాహసయాత్రకు మద్ద తునిచ్చిందని వాజ్పారు పేర్కొన్నాడు. ఈ విజయం ఒక్కడిదే కాదని పర్వతారోహకుల సమిష్టి విజయమని ఆయన తెలిపారు.