Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: సమాజంలో మానవత్వం మంటగలిసిపోతున్నది. కనిపెంచిన సొంత తల్లి పట్ల కర్కషంగా ప్రవర్తించాడో ప్రబుద్ధుడు. కొంచమైన కనికరం లేకుండా తన తల్లిని ట్రాక్టర్ ముందు లాగిపడేశాడు. మహారాష్ట్రలోని వాషీమ్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... సదరు వ్యక్తికి మరో వ్యక్తితో భూతగాదాలున్నాయి. ఈ విషయంలో ఇటీవలే కోర్టుకెళ్లగా అతడు ఆ కేసు ఓడిపోయాడు. దీంతో కేసు గెలిచిన వ్యక్తి ఆ పొలాన్ని సాగుచేసుకోవడానికి ట్రాక్టర్తో దున్నుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇతడు అక్కడికి వెళ్లాడు. పొలం దున్నొద్దంటూ ప్రత్యర్థితో వాగ్వాదానికి దిగాడు. అరతటితో ఆగకుండా తన తల్లిని విసురుగా లాగి ట్రాక్టర్ ముందు పడేశాడు. పక్కనున్న వారు అతన్ని వారిస్తున్నా ఆగకుండా ఆమెను దాని కిందికి ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆ వృద్ధురాలు గాయాలపాలయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలైంది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తితోపాటు ఇరువర్గాలకు చెందిన 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.