Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మహారాష్ట్రలో ప్లాస్టిక్పై నిషేధం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ను నిషేధిస్తూ..మార్చి 23న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్లాస్టిక్ తయారీ, వాడకం, అమ్మకం, ప్లాస్టిక్ పంపిణీ, నిల్వలపై నిషేధాన్ని ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. వీటితో పాటు ప్యాకెజింగ్ మెటీరియల్, థర్మకోల్పైనా నిషేధాన్ని విధిస్తూ..మెడిసిన్స్ ప్యాకెజింగ్లాంటి కొన్నింటికి మినహాయింపునిచ్చింది. మార్చి 23న నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం అప్పుడు నిల్వ ఉన్న స్టాక్ వినియోగించుకునేందుకు మూడు నెలల సమయాన్నిచ్చింది. దీంతో శనివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.