Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,క్యూబా నేత డియాజ్ కానెల్ సమక్షంలో సంతకాలు
హవానా: బయోటెక్నాలజీ, ఆరోగ్య రంగాలలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా క్యూబా, భారత్లు అడుగు వేశాయి. దీనికి సంబంధించిన మూడు ఒప్పందాలపై రెండు దేశాలు శనివారం సంతకాలు చేశాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్యూబా పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి.
క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్ డియాజ్ కానెల్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ల సమక్షంలో భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ, క్యూబా ప్రజాఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు దీనికి సంబంధించిన అవగాహనా ఒప్పంద పత్రాలపై (ఎంఓయూ)లపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా వైద్యం, హోమియోపతిలో సాంప్రదాయ పద్దతుల అనుసంధానాన్ని బలోపేతం చేసుకునేందుకు అంగీకరించాయి. బయో టెక్నాలజీలో సహకారానికి సంబంధించిన ఎంఓయూపై శాస్త్ర సాంకేతిక రంగ మంత్రిత్వ శాఖలు సంతకాలు చేశాయి. రామ్నాథ్ కోవింద్ పర్యటనలో భాగంగానే ద కౌన్సిల్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ రీసెర్చ్కు చెందిన బయో క్యూబా ఫార్మా, భారత్లోని కలామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ముందు డియాజ్ కానెల్, రామ్నాథ్ కోవింద్లు అధికారికంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు కోవింద్ క్యూబా నేషనల్ హీరో జోస్ మార్టీ, మహాత్మా గాంధీలకు నివాళులు అర్పించారు.