Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో రెండో రోజుకు చేరుకున్న ఆందోళన
- 35 లీటర్ల పాలతో స్నానం చేసి, పశువులను కడిగి వినూత్న నిరసన
ముంబయి: మహారాష్ట్రలో పాల రైతులు తమ ఆందోళనను మంగళవారం కూడా కొనసాగిం చారు. పాల సేకరణ ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు ఆందోళ నకు దిగిన సంగతి తెలిసిందే. తమ ఆందోళనలో భాగంగా షోలా పూర్కు చెందిన ఒక రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. మగ ల్వేధ పట్టణ పరిధిలోని లెండవే చంచల్ గ్రామానికి చెందిన సాగర్ లెండవే 35 లీటర్ల పాలతో స్నానం చేయడమే కాకుండా, తన పశువులను కూడా పాలతో కడిగాడు. సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. మహా రాష్ట్రలో పాలరైతుల ఆందోళన సోమవారం ప్రారంభ మైన సంగతి తెలిసిందే. వేలాది లీటర్ల పాలను తీసుకెళ్తున్న టాంకర్లను రైతులు అడ్డుకుని ధ్వంసం చేశారు. టెట్రా ప్యాక్లను రోడ్లపై విసిరేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాల సరఫరా దెబ్బతింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే పాలను ఉచితంగా సరఫరా చేసినట్లు వార్తలు అందాయి. పాలసేకరణ ధరపై సబ్సిడి ఇవ్వడమే కాకుండా వెన్న, పాలపొడి తదితరాలపై జీఎస్టీని రద్దు చేయాలని కూడా ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న స్వాభిమాని షేత్కారి సంఘటన (ఎస్ఎస్ఎస్), మహారాష్ట్ర కిసాన్ సభ (ఎంకేఎస్) లు డిమాండ్ చేశాయి. ఎస్ఎస్ఎస్ ప్రెసిడెంట్ ఎంపీ రాజు శెట్టి ఈ సందర్భంగా మాట్లాడుతూ లీటరుకు రూ.27లుగా పాలసేకరణ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తే , రైతులకు మాత్రం కేవలం రూ.17లు మాత్రమే అందుతున్నాయని చెప్పారు. లీటరు పాలపై రైతులకు నేరుగా రూ.5లు సబ్సిడి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నా మన్నారు. గోవా, కర్ణాటక, కేరళలో రైతులకు నేరుగా రూ.5లు సబ్సిడి లభిస్తున్నదన్నారు.