Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిధిలాలకింద 20 మంది?
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని షాబేరి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఆరంతస్థుల భవంతి కూలిపోయింది. శిధిలాల కింద 20 మంది చిక్కుకుని ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఇటీవల నిర్మాణం పూర్తిచేసుకున్న భవంతి..పక్కనే నిర్మా ణంలో ఉన్న భవంతిపై అమాంతంగా ఒరిగిపో యింది.ఈ రెండు భవంతుల్లోనూ సుమారు 50 మంది వరకు ఉండొచ్చని సమాచారం. సహాయకబృందాలు రంగంలోకి దిగాయి.పొక్లయినర్ సహాయంతో అధికారులు శిధిలాలను తొలగించేపని ముమ్మరం చేశారు.