Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూజివీడు సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన
నూజివీడు: కల్తీ మిరప విత్తనాల వల్ల నష్టపోయిన కృష్ణాజిల్లా ముసునూరు మండలం వలసపల్లి కౌలు రైతులు నష్టపరిహారం చెల్లించాలంటూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ముసునూరు నుంచి నూజివీడు ఆర్డీఓ కార్యాలయం వరకు 13 కిలో మీటర్ల మేర గురువారం పాదయాత్ర నిర్వహించారు. ముసునూరు నుంచి ప్రారం భమైన పాదయాత్ర ముసునూరు, చింతలవల్లి, సింహాద్రిపురం, పోతు రెడ్డిపల్లి గ్రామాల మీదుగా నూజివీడు చేరుకుంది. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయం ముందు భైఠాయించి పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగబోయిన రంగారావు మాట్లాడుతూ కల్తీ మిరప విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పరిహారం ఎకరానికి రూ.91వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.