Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వదేశీ పరిజ్ఞాణంతో రూపొందించిన డీఆర్డీఓ
- ఉపరితలం నుంచి ఉపరితలం మీదుగా 150 కి.మీ లక్ష్యాలను చేదించగలదు
బాలాసోర్: స్వదేశీ పరిజ్ఞాణంతో రూపొందిన బాలిస్టిక్ క్షిపణి 'ప్రహార్' పరీక్షను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) గురువారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిషా తీరప్రాంతంలోని బాలాసోర్లో గల ఐటీఆర్ లాంచింగ్ ప్యాడ్-3 నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు డీఆర్డీఓ దీనిని ప్రయోగించింది. రోడ్ మొబైల్ లాంచర్ నుంచి క్షిపణిని ప్రయోగించినట్టు డీఆర్డీఓ తెలిపింది. స్వదేశీ పరిజ్ఞాణంతో ప్రహార్ క్షిపణిని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలం మీదుగా తక్కువ దూరంలోగల వ్యూహాత్మక లక్ష్యాలను ఇది చేదించగలదు. ఘన ఇందనంతో నిండిన ఈ క్షిపణి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించగలదని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-1ను ప్రహార్ భర్తీ చేయగలదని, ఏకకాలంలో బహుల లక్ష్యాలను ఇది సాధించగలదని వెల్లడించాయి. క్షిపణి ప్రయోగాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, డీఆర్డీఓ చైర్మెన్ డాక్టర్ అతేశ్ రెడ్డిలు ప్రత్యక్షంగా వీక్షించారు. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం పట్ల డీఆర్డీవో, ఆర్మీ, శాస్త్రవేత్తలకు భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. కాగా, క్షిపణి ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకొని అంతకముందు దగ్గరలోని ఐదుగ్రామాల్లో ఉన్న నాలుగువేల మందిని పరిహారంతో సహాయ శిభిరాలకు అధికారులు తరలించారు.