Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్గావ్: మహిళలపై జరుగుతున్న లైంగికదాడుల పట్ల నారీలోకం ఓవైపు సోషల్ మీడియా వేదికగా 'మీ టూ' అంటూ గర్జిస్తుంటే.. మరోవైపు తనకు ఎదురైన లైంగిక వేధింపులను ఓ మైనర్ మరో విధంగా వ్యక్తీకరించింది. హర్యానాలోని గుర్గావ్ జిల్లా బాద్షాపూర్కు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ బాలిక (15).. పాఠశాలలో ఈ నెల 1న నిర్వహించిన యూనిట్ టెస్ట్లో తను ఎదుర్కొన్న వేధింపులపై రాసింది. 'మా అంకుల్ నన్ను లైంగికంగా వేధించాడు. అంకుల్తో పాటు ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న మా బంధువు (మైనర్) కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు' అంటూ సమాధాన పత్రంలో పేర్కొంది. ఐదు రోజుల తర్వాత పరీక్ష పత్రాలు దిద్దుతున్నప్పుడు ఇది గమనించిన ఉపాధ్యాయులు.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.