Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నేరారోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ్యులపై పెండింగ్ లో ఉన్న కేసుల జాబితా వివరాలను రెండు వారాల్లోగా పంపిం చాలని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. సిద్ధం చేసిన జాబితాను తమ ఎదుట హాజరుపరచాలని కేంద్రం తరఫున వాదిస్తున్న అడిషినల్ సొలిసిటరీ జనరల్ ఎ.ఆర్. నడ్కర్నీకి సూచించింది.
సుప్రీంకోర్టు, 2014లో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం.. నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసులను ట్రయల్ కోర్టులు ఏర్పాటు చేసి ఏడాదిలోగా వాటిని విచారించాలని తీర్పునిచ్చింది. కానీ, ఇంతవరకూ కేంద్రం నుంచి ఆ ప్రయత్నమేదీ జరుగలేదు.
ఇదిలాఉండగా, చట్టసభ్యులపై పెండింగ్ కేసుల జాబితాను వెల్లడించాలని గత నెల 12న 19 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్లకు ఆదేశించిన కోర్టు.. వివరాలను పంపించడానికి మరో రెండు వారాల గడువును మంజూరు చేసింది.