Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 5 లక్షల 20 వేల కోట్లు
- యూఎన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక నష్టాలు ఆ దేశ పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇక, ప్రకృతి విపత్తుల ద్వారా సంభవించే నష్టాలైతే.. అభివృద్ధి సంగతి అటుంచితే కొన్నేండ్ల పాటు ఆ దేశాలు తీవ్ర ఆర్థిక భారాల్ని మోయక తప్పదు. భారత్లో కూడా ప్రకృతి విపత్తులతో గడిచిన ఇరవై ఏండ్లలో చేకూరిన నష్టం రూ. 5 లక్షల 20 వేల కోట్లు (80 బిలియన్ డాలర్లు) అని యూనైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (యూఎన్ఐఎస్డీఆర్) నివేదిక వెల్లడించింది.
ప్రతీ ఇరవై ఏండ్లకు ఒకసారి వెల్లడించే ఈ నివేదిక ప్రకారం.. భారత్లో 1998-2017ల మధ్య సంభవించిన విపత్తుల వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని యూఎన్ఐఎస్డీఆర్ చీఫ్ మామీ మిజూతోరి తెలిపారు. ప్రకృతి విపత్తులను ముఖ్యంగా భూకంపాలు, సునామీ, తుఫానులు, పిడుగులు, వడగాలులు, తీవ్రమైన కరువులుగా పేర్కొన్నారు. ఈ కారణంగా సంభవించే విపత్తులతో ఇరవై ఏండ్లలో దేశంలో 13 లక్షల మంది మరణించగా కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. విపత్తులు రావడానికి ఎక్కువగా ఆస్కారమున్న భారత్ లాంటి దేశంలో.. ఇవి కలిగించే నష్టాలు ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన బడ్జెట్ అంచనాల ప్రకారం.. పలు సంక్షేమ, అభివృద్ధి పనుల కోసం నిర్ధేశించుకున్న నిధులను కూడా విపత్తుల నష్టాల భర్తీకి ఉపయోగించాల్సి వస్తుండటంతో దేశం ఆర్థికంగా భారాలు మోయాల్సి వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లైతే.. విపత్తుల కారణంగా ఆయా దేశాలు 3 ట్రిలియన్ డాలర్లు (దాదాపు 195 లక్షల కోట్లు)గా నష్టపోయాయి. దేశాల ఆర్థిక పరిస్థితులు విశ్లేషించుకుంటే, మొత్తం నష్టాలలో విపత్తులతో కలిగిన నష్టాలే 70 నుంచి 75 శాతం వరకు ఉన్నాయని నివేదిక బహిర్గతపరిచింది. అదీగాక.. 1978-1997తో పోల్చితే, గడిచిన ఇరవై ఏండ్లలో ఇవి 120 శాతానికి పెరగడం గమనార్హం.