Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తం కాకుంటే పెనుముప్పు
అమరావతి:రాష్ట్రంలో స్వైన్ఫ్లూ విజృంభిస్తున్న తీరుకు సాక్షాత్తు సీిఎం డాష్ బోర్డు వెల్లడిస్తున్న ఈ అంకెలే సాక్ష్యం! అన్ని రకాల పరీక్షల తరువాత వ్యాధి బారిన పడినట్లు అధికారికంగా నిర్ధారించిన వారి సంఖ్యే ఇది. ప్రభుత్వ ఆస్పత్రులకు రాకుండా, వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో స్వైన్ఫ్లూ లక్షణాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య దీనికి అదనం. వ్యాధుల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, ముఖ్య మంత్రితో పాటు, అత్యున్న తస్థాయి అధికారులు పదేపదే సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రోజురోజుకీ వ్యాధి ప్రబలుతోందన్న సంకేతాలే రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి వస్తున్నాయి. గత శుక్రవారం ఒక్క రోజే (19వ తేది) రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గురు ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి బారిన పడి మృతి చెందు తున్న వారి సంఖ్య కూడా పెరుగు తుండటం ఆందో ళన కరం! ఒక్క కర్నూలు జిల్లా లోనే గడిచిన రెండు నెలల కాలంలో ఆరు గురు మృతి చెందారు. విశాఖ లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. డెంగీ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. అక్టోబర్ 5 నుండి 11వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా 57 డెంగీ కేసులు నమోదైతే, ఆ తరువాత డెంగీ బాధితుల సంఖ్య గణనీయంగా పెరగింది. అక్టోబర్ 18 వ తేదికి అధికారిక సమాచారం ప్రకారమే రాష్ట్రంలో 106మంది డెంగీ వ్యాధి బారిన పడ్డారు. అనధికారికంగా వీరి సంఖ్య ఇంతకన్నా చాలా ఎక్కువ! రోగ నిర్ధారణ కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతోపాటు, ప్రజల్లో అవగాహన పెంచడం, అధికారయంత్రాంగం పెద్ద ఎత్తున అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని
ఈ అంకెలు తెలియ చేస్తున్నాయి. లేని పక్షంలో రానున్న రెండు మూడు నెలల కాలంలో ఈ వ్యాధులు మరింతగా ప్రబలే ప్రమాదం ఉంది.
పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ!
స్వైన్ఫ్లూ, డెంగీ కేసులు పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక కేంద్రం విశాఖలో వ్యాధులు పెద్ద ఎత్తున ప్రబలుతున్నాయి. ఈ నగరంలో స్వైన్ఫ్లూతో పాటు, డెంగీ కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. విశాఖ జిల్లాలో అక్టోబర్ నెలలో (12నుండి 18వ తేది వరకు) నమోదైన 15 కేసులూ విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోనివే కావడం గమనార్హం. ఆ సమయంలోనే చిత్తూరు జిల్లాలో ఏడుగురికి కొత్తగా వ్యాధిసోకగా, వారిలో ఇద్దరు తిరుపతి నగరానికి చెందినవారు. కర్నూలులో నలుగురు ఈ వ్యాధి బారిన పడగా వీరిలో ఒకరిది కర్నూలు నగరం. విశాఖలో ఒక ఐపిఎస్ అధికారే ఈ వ్యాధి బారిన పడ్డ సంగ తి తెలిసిందే. రాష్ట్రాన్ని కబళిస్తున్న డెంగీ కూడా పట్టణ ప్రజలపైనే ప్రతాపం చూపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో మూడు డెంగీ కేసులు ఈ నెల మొదటివారంలో నమోదుకాగా, 18వ తేదికి ఈ వ్యాది బారిన పడిన వారి సంఖ్య 63కు చేరింది. వీరిలో కాకినాడకు చెందినవారే 33 మంది! విశాఖ నగరంలోనూ 17 మంది డెంగీ బారిన పడ్డారు.
ఎక్కడెక్కడ ...
అధికారిక రికార్డుల ప్రకారం స్వైన్ఫ్లూ విశాఖ, చిత్తూరు, కర్నూలు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో వ్యాపిస్తోంది. విశాఖ, చిత్తూరు. కర్నూలు జిల్లాల్లో గడిచిన రెండు నెలలుగా వ్యాధి ప్రభావం కనిపిస్తోంది. వాస్తవానికి ఆగస్టు నెలాఖరుకు రాష్ట్రంలో అధికారిక రికార్డుల ప్రకారం స్వైన్ఫ్లూ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. చిత్తూరు జిల్లా తిరుపతిలో మొట్టమొదట ఈ వ్యాధిని గుర్తించారు. ఆ తరువాత రాష్ట్రమంతా కనిపిస్తోంది. విశాఖతో పాటు గుంటూరు. ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరుల్లో డెంగీ ప్రబలుతోంది. ఈ వ్యాధి తొలుత విశాఖలో పెద్ద ఎత్తున కనిపించినప్పటికీ, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా డెంగీ బాధితులు ఉన్నారు.