Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ గాంధీ ఆరోపణ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 14 వేల కోట్ల మేర మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ మామ మెహుల్ చోక్సీని దేశం దాటించడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూతురు సాయం చేసిందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా ఈ ఆరోపణలు చేశారు. దీనికి గానూ ఆమెకు మెహుల్ చోక్సీ బ్యాంకు ఖాతా నుంచి నగదు అందిందని ఆ ఖాతా వివరాలను పోస్టు చేశారు. దీనికంతటికీ కారణమైన అరుణ్జైట్లీ.. తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ మస్ట్ రిజైన్ అనే హ్యాష్ట్యాగ్తో ఆయన ఈ పోస్టును ఉంచారు. ఈ ఆరోపణలపై అరుణ్ జైట్లీ ఇంకా స్పందించలేదు.