Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై.. ఆమె కుటుంబసభ్యులు చూస్తుండగానే దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన బీహార్లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన ముజఫర్పూర్ జిల్లా లిమిక్ చౌక్లో జరిగింది. బాలిక ఇంట్లోకి బలవంతంగా చొరబడిన దుండగులు ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగారు. వారిని తీవ్రంగా గాయపరిచి మైనర్పై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.