Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనరల్ డెస్క్
ఎన్నికలొచ్చినపుడే జనం ముందుకెళ్లే రాజకీయపార్టీలు కొన్నైతే.. మరికొన్ని పార్టీలు ఎక్కడైతే తమకు ఠికానా లేదో అక్కడే దృష్టిపెడుతుంటాయి. ఇపుడు కేరళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్నది అదే. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్లో మహిళల ప్రవేశంపై.. సుప్రీం తీర్పును మేం అస్సలు ఉల్లంఘించబోమన్నట్టుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యవహరించాయి. వామపక్షపార్టీ అధికారంలో ఉన్న కేరళ విషయానికివస్తే... శబరిమలలో మహిళల ప్రవేశిస్తే.. మైల పడిపోతుందనే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ వైఖరి చర్చనీయాంశంగా మారింది.
కేరళ అనగానే పచ్చటి పచ్చికబయళ్లు.. సముద్ర పాయల్లా ఉంటే కాలువల్లో పడవలు.. సాంప్రదాయాలకు నెలవుగా కొనియాడతారు. అయితే అలాంటి సహజసిద్ధమైన కేరళ ప్రకృతిపై వరదలు నిలువెల్లా ముంచాయి. కేంద్రం ఆపన్నహస్తం అందించలేదు. అక్కడ వామపక్షప్రభుత్వం ఉండటమే కారణమన్నది సుస్పష్టం. చివరికి విదేశీ సాయాన్ని కూడా అడ్డుకున్నది మోడీ సర్కార్. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో పినరయి సర్కార్లోని క్యాబినెట్ మంత్రులు మొదలుకుని సామాన్య జనం వరదసహాయక పునరాసంలో మునిగిపోయారు. పెనువిపత్తు నుంచి కేరళ కోలుకునే దిశగా అడుగులేస్తోంది. ఇంతలో శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించాలని సుప్రీం తీర్పుతో కేరళలో శాంతిభద్రతల సమస్యలగా మారింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులే కాదు కాంగ్రెస్ కూడా హిందూత్వశక్తులను ప్రేరేపించింది.
కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు దిగారు హిందూత్వశక్తులు. అరాచకశక్తులుగా మారారు. కేరళలో ఉన్న ఐక్యత, సోదరభావంపై విపరీతమైన ఒత్తిడిని పెంచారు. లౌకికవాద కేరళ సమాజాన్ని రెండు రాజకీయ విభాగాలుగా చీల్చారు. అభివృద్ధికాముక, పురోగమన విలువలను సూచించే దానికి లెఫ్ట్ కూటమి నేతృత్వం వహించింది. అభివృద్ధి నిరోధక, ప్రమాదకరమైన సంప్రదాయవాద విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఫ్ు పరివార్ తెరవెనుక బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వం వహించాయి. రాజ్యాంగం, మత విశ్వాసాల మధ్య జరిగిన సంఘర్షణలో ఓటు బ్యాంకుకే అవి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి.. 10 నుంచి 50 ఏండ్ల మధ్య మహిళల ప్రకృతి సంబంధమైన అంశాన్ని విశ్వాసాలతో ముడిపడిన 'మలినమైన' వారిగా ముద్రవేసే పనిలో నిమగమెంది. వాస్తవానికి, అది సంఫ్ు 'ఎజెండాకు తలొగ్గటమే కాదు.. కేరళ సమాజం నిరంతర పోరాటాల ద్వారా సాధించుకున్న అభివృద్ధికర విలువలను మోసగించేందుకు చేసే ఒక దుష్టప్రయత్నమిది..
పురుషులు, మహిళలన్న తేడాలేదు. అందరూ సమానమేనని ప్రధాని మోడీ అంటారు. కానీ ఆచరణలోకి వచ్చినపుడు మాత్రం ఎలా వివాదం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదనటానికి శబరిమల ఉదాహరణ. వాస్తవానికి 'మహిళా హక్కులను హరించే తెరలా మతాన్ని వాడకూడదు. ఇలాంటి చర్యలు మహిళల గౌరవాన్ని తగ్గిస్తాయి.. ఇలాంటి వివక్ష శతాబ్దాలుగా మహిళలను భయంకరమైన నీడలా వెంటాడుతోంది. 'రుతుస్రావం' చుట్టూ నెలకొన్న నిగూఢత, సాంప్రదాయిక విశ్వాసాలను ఆసరాగా చేసుకొని వారిని 'మలినస్తులు'గా చూస్తున్నారు. రాజ్యాంగంలో ఇలాంటి అసంబద్ధ విశ్వాసాలకు స్థానంలేదు. ఇలాంటి నమ్మకాల ఆధారంగా వారి సమాన హక్కులను తిరస్కరించరాదు' అని జస్టిస్ చంద్రచూడ్ శబరిమల తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. 'అపరిశుభ్రమైన, మలినమైన' అనే దాన్ని ఆధారంగా చేసుకొని మహిళలను ఆలయంలో ప్రవేశించడంపై నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం. మహిళల స్వేచ్ఛ, చైతన్యానికి కులవ్యవస్థ వ్యతిరేకం. అలాగే ఇది 'నిమ్నకులాలకు' కూడా వ్యతిరేకమైనది. ఈ కోణంలో.. లింగ అణచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా చారిత్రాత్మక విధిని కులంపై పోరాటం నిర్వహిస్తున్నది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఇటీవల తీర్పును ఒక ముఖ్యమైన అంశంగా చూడాలి, ఇది లింగ సమానత్వ ప్రశ్నకు సంబంధించినది. కేరళ అభివృద్ధినీ, సాంఘిక పురోగతినీ అడ్డుకునే ఆచారాల అడ్డుగోడలను బద్దలుకొట్టడానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక మార్గం.
సంఫ్ు శక్తుల దాడి వెనుక..
కేరళలో చొరబడేందుకు సంఫ్ుపరివర్ 1960 నుంచి చేయని ప్రయత్నం లేదు. ఆర్ఎస్ఎస్, హిందూత్వ శక్తులను ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉన్నారు. దేశంలో సంఫ్ు వ్యతిరేక పోరాటాలకు అగ్రభాగాన నిలుస్తున్న ఆ రాష్ట్రాన్ని సైద్ధా:తికంగా, భౌతికంగా దెబ్బతీయడమే వారి ప్రధాన లక్ష్యం. 2014 తర్వాత కేరళలో లబ్దిపొందేందుకు వారి ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు... ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఆ శక్తుల చేతికి చిక్కింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఆ రాష్ట్రంలో ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు, ఆ రాష్ట్రాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందుకు సుప్రీంకోర్టు తీర్పును సైతం పణంగా పెట్టేంది. కేరళ వామపక్షాలు సంఫ్ు ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూనే ఉన్నాయి.. తిప్పికొడుతూనే ఉన్నాయి.
నీలక్కల్ పోరాటం, తలాసేరీ, మరాడ్ అల్లర్లు.. ఇలా కేరళలో లౌకిక, అభివృద్ధికర విలువలను భంగపరచడంలో సంఫ్ు పరివార్ పాత్రను నిరూపించేవి కేరళ చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి, శబరిమల తాజాది.
లౌకిక శక్తులన్నీ ఐక్యంగా బలమైన పోరాటాన్ని నిర్మించడం ద్వారా.. అభివృద్ధికాముల చుట్టూ ఉన్న ప్రజలందరినీ సమీకరించడం ద్వారా మాత్రమే అలాంటి కుతంత్రాలను ప్రతిఘటించవచ్చునన్నది చరిత్ర నేర్పిన పాఠం.
మరో మహిళ విశ్వయత్నం..
- అడ్డగింతల నడుమ వెనక్కి
- మూతపడిన శబరిమల ఆలయం
పంబ (కేరళ) : శబరిమలలో ఐదో రోజు సోమవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్య వయస్కురాలైన మరో మహిళ ఆలయంలోకి ప్రవేశించేందుకు విశ్వప్రయత్నం చేసింది. కాగా హిందూత్వ శక్తులు అడ్డుకోవడంతో ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. మాస పూజల కోసం ఐదు రోజులపాటు అంటే బుధవారం నుంచి శబరిమల ఆలయం తెరుచుకోగా.. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో గుమిగూడిన హిందూత్వ శక్తులు లోపలికి వెళ్ళే:దుకు ప్రయత్నిస్తున్న మహిళలను బెదిరింపులు, హెచ్చరింపులతో అడ్డుకుంటూనే ఉన్నారు. 5 నుంచి 10 ఏండ్లలోపు వయస్సుగల మహిళలు మరింత మంది లోపలికి వెళ్ళే:దుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నడుమ శబరిమలలో భద్రతను సోమవారం మరింత కట్టుదిట్టం చేశారు. దళిత కార్యకర్త బిందు సోమవారం ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో.. పోలీసు రక్షణ మధ్య ఆమె ప్రయాణిస్తూ పంబాకు చేరుకోగా.. బీజేపీ కార్యకర్తలు, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న నిరసనకారులు అక్కడి రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో ఆమెను పోలీసు వాహనంలో వెనక్కి పంపించారు. కాగా, పెద్దఎత్తున నిరసనల మధ్య దాదాపు 12 మంది సోమవారం ఆలయం నుంచి వెనుతిరిగినట్టు తెలుస్తున్నది. ఆదివారం కూడా ముగ్గురు మహిళలను ఆయలంలోకి వెళ్ళకుండా హిందూత్వశక్తులు అడ్డుకున్నాయి. మరోవైపు నెలవారీ పూజల కోసం ఈ నెల 17న ఆలయాన్ని తెరువగా సోమ వారం రాత్రి మూసివేశారు.
రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు నిర్ణయం
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ఎప్పుడు విచారించాలన్న దానిపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం నిర్ణయించనున్నది. ఆ పిటీషన్లు వాదనలకు వచ్చే తేదీని ధర్మాసనం ప్రకటించనున్నది. శబరిమల అంశంపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై మొత్తం 19 పిటిషన్లు దాఖలయ్యాయి.