Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ బంకులు మూత పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండురోజుల పాటు(సోమ,మంగళవారాల్లో) బంకులు మూసి వేయనున్నట్టు ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ (డీపీడీఏ) ప్రకటించింది. దీనికితోడు ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ యూనియన్లు కూడా సోమవారం సమ్మెకు దిగాయి. దీంతో, ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఢిల్లీలో దాదాపు 400పెట్రోల్ బంకులున్నాయి. వీటికి అనుబంధం గా ఏర్పాటైన సీఎన్జీ స్టేషన్లు కూడా మూతపడ్డాయి. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు అమ్మకాలను నిలిపి వేయనున్నట్టు పెట్రోల్ డీలర్లు తెలిపారు. చమురుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించనందుకు నిరసనగా తామీ నిర్ణయం తీసుకున్నట్టు డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. పొరుగు రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, హర్యానాల్లో వ్యాట్ను తగ్గించినట్టు అసోసియేషన్ తెలిపింది. ఇంధనం ధరలు ఢిల్లీతో పోలిస్తే ఆ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నట్టు అసోసి యేషన్ తెలిపింది. దాంతో, ఢిల్లీలో డీజిల్ అమ్మకాలు 50శాతం, పెట్రోల్ అమ్మకాలు 25శాతం తగ్గినట్టు అసోసియేషన్ తెలిపింది. దీంతో, రాష్ట్రానికి కూడా ఆదాయం తగ్గుతుందని అసోసియేషన్ చెబుతోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం సమ్మె వెనుక బీజేపీ ఉన్నదని విమర్శించారు. నాలుగు మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో చమురు ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు.